నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్..మరో నోటిఫికేషన్ విడుదల..

-

బ్యాంక్ లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది.ఈ సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎస్బీఐ ఈ నెలలో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మరో రెండు వారాల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. SBI క్లర్క్ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ sbi.co.inని చెక్ చేస్తూ ఉండాలని నిపుణులు అంటున్నారు..

అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీలు, పరీక్ష విధానం, అర్హతలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్స్ అన్నీ SBI క్లర్క్ 2022 నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్షను స్టేట్ బ్యాంక్ రెండు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. తర్వాత LPT పేరుతో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు…

ఎగ్జామ్స్ సిలబస్..

ప్రిలిమ్స్ పరీక్షల సిలబస్‌లో 3 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ సెక్షన్లు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్‌లో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది..

ఈ ఉద్యోగాలకు అర్హతలు..

విద్యా అర్హత గ్రాడ్యుయేషన్. ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్‌లో ఉన్న అభ్యర్థులు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు…

వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిపై సడలింపు ఉంటుంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్  కూడా ఇటీవల క్లర్క్ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్‌ల కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు IBPS అధికారిక సైట్ ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 6035 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష 2022 సెప్టెంబర్‌లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్‌లో ఉంటుంది..దీనికి వయస్సు 20 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి..

Read more RELATED
Recommended to you

Latest news