BREAKING : సికింద్రాబాద్‌ కాల్పుల్లో ఒకరు మృతి

-

BREAKING : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో పరిస్థితి అదుపు తప్పింది. ఇక చేసేది ఏమీ లేక.. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. గాల్లో కాల్పులు జరుపుతున్నారు పోలీసులు. ఈ కాల్పుల్లో.. కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లోని ఒకటో నంబర్‌ ఫ్లాంట్‌ ఫాం దగ్గర ఓ యువకుడు.. పోలీసుల కాల్పుల్లో మరణించారని సమాచారం అందుతోంది. ఇక మరికొందరికి గాయాలు కావడంతో.. స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news