కేసుల మాఫీ కోసమే.. కేంద్రం కాళ్ల దగ్గర జగన్ ఉంటున్నాడు – జాతీయ మీడియా

-

కేసుల మాఫీ కోసమే.. కేంద్రం కాళ్ల దగ్గర జగన్ ఉంటున్నాడని సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని నారా లోకేష్‌ తన ట్విట్టర్‌ లో పేర్కొన్నారు కేసుల మాఫీ కోసం జగన్ కేంద్రం వద్ద సాగిలపడ్డాడు అని జాతీయ మీడియా కోడై కూస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే మిన్న అనుకునే ముఖ్యమంత్రి ఉండటం మన ఖర్మ అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

ఇది ఇలా ఉండగా… కెసిఆర్ కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ దేశాయ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి ప్రస్తావించిన రాజ్ దీప్ ప్రతినేత కూడా తమను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారని అన్నారు.కేసీఆర్ ను తీసుకుంటే ఆయన తన టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కన్వర్జేషన్ లో కెసిఆర్ తన సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్ ను చేస్తే 2024 ఎన్నికల మొత్తం ఖర్చు భరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్ కు సమకాలికంగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా? అని రాజ్ దీప్ పేర్కొన్నారు. ఇంకా ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్ దీప్ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version