డబ్బులతో పిసిసి కొన్నారన్న కోమటిరెడ్డి వాదనను నమ్ముతున్నా – మర్రి శశిధర్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో పిసిసి కొన్నారన్న కోమటిరెడ్డి వాదనను నమ్ముతున్నట్లు తెలిపారు. తాము హోంగార్డుల్లా కల్పిస్తున్నామా అని ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్, రాజగోపాల్ రెడ్డి చెప్పినవి నిజాలని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది అన్నారు. మాణిక్యం టాగూర్ అసలు పట్టించుకోరని.. కేసీ వేణుగోపాల్ కూడా పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఇక రాహుల్ గాంధీ ఎవరిని కలిసే పరిస్థితి లేదన్నారు శశిధర్ రెడ్డి. వరంగల్ సభలో ఎంత సీనియర్లు అయినా ఉంటే ఉండండి.. లేదంటే వెళ్ళండి అని ఎలా అంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు వేదికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అలా ఎలా తిట్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వేదికపై జానారెడ్డి, ఉత్తమ్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఉండి కూడా తిట్టేస్తే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version