BREAKING : కందుకూరు, గుంటూరు ఘటనలపై జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

-

BREAKING : కందుకూరు, గుంటూరు ఘటనలపై జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. కందుకూరు, గుంటూరు ఘటనల్లో విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో కమిషన్ నియమించింది.

జస్టిస్ శేషశాయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది జగన్‌ సర్కార్‌. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యుల పై విచారణ చేయనున్న కమిషన్.. ఏర్పాట్లలో లోపాలు, అనుమతుల ఉల్లంఘనల కోణంలోనూ విచారణ చేయనుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రికమెండేషన్స్ ఇవ్వనుంది కమిషన్.

Read more RELATED
Recommended to you

Latest news