ఏపీలో కరోనా గురించి సంచలన విషయం…

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. 500 మార్క్ దిశగా కేసులు వెళ్తున్నాయి. తాజాగా కరోనా విషయంలో ఒక సంచలన విషయం బయటపడింది. అనంతపురం జిల్లాలోని హిందుపురంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా వైరస్ వైద్యుడుకి సోకింది. అలాగే ఎమ్మార్వో కి కూడా కరోనా ఇలాగే వచ్చింది. వీళ్ళకు ఇలా కరోనా సోకడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇప్పుడు వాళ్ళ ఇద్దరి కాంటాక్ట్ లను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ లో ఉంచగా కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి తరలించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న వాళ్ళ వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇది గనుక ఏపీలో మొదలైతే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు అనే భావన వ్యక్తమవుతుంది. ఇలాంటి కేసులను ఆదిలోనే కట్టడి చెయ్యాలి.

ప్రకాశం జిల్లా ఒంగోలు లో కూడా ఇలాంటి కేసు నమోదు అయింది. అతనికి లోకల్ కాంటాక్ట్ ద్వారానే కరోనా వచ్చినట్టు గుర్తించారు. ఏపీ ఉన్నతాధికారులు కూడా దీనిని ఆరా తీసారు. సిఎస్ నీలం సహాని ఈ కేసులకు సంబంధించిన వివరాలను సేకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news