అదుపుతప్పి వాగులో పడిన టెంపో.. ఏడుగురు దుర్మరణం

-

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులులో అర్ధరాత్రి పూట అదుపుతప్పిన టెంపో వాగులో పడింది. ఈ సమయంలో టెంపోలో చాలా మంది పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను కులులోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు.. జిల్లా యంత్రాంగం కలిసి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులంతా హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news