టీఆర్ఎస్‌కు షాక్ : నిజామాబాద్‌లో క‌మ‌ల వికాసం.. స‌ర్వేలో వెల్ల‌డి

-

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ విస్త‌రిస్తుంది. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుట్ల క‌విత ఓడిపోయిన నాటి నుంచి టీఆర్ఎస్ కు వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. బీజేపీ కూడా అదును చూసుకుని నిజామాబాద్ లో పాగ వేయ‌డానికి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. కాగ తాజా గా ఒక ప‌త్రిక నిజామాబాద్ జిల్లాలో స‌ర్వే చేసింది. ఈ స‌ర్వేలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తు ఫ‌లితం వ‌చ్చింది.

నిజామాబాద్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో 5 స్థానాల్లో బీజేపీయే గెలుస్తుంద‌ని ఆ స‌ర్వే తేల్చింది. ఈ స‌ర్వే ఫ‌లితాన్ని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మపురి అర‌వింద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిజామాబాద్ అర్బ‌న్, రూర‌ల్, ఆర్మూర్, కోరుట్ల తో పాటు బోధ‌న్ లో కూడా బీజేపీయే విజ‌యం సాధిస్తుంద‌ని స‌ర్వేలో తెలింద‌ని ఎంపీ అర‌వింద్ తెలిపారు. అలాగే మిగిలిన రెండు స్థానాల్లో కూడా ఎన్నిక‌ల నాటికి పరిస్థితులు మారే అవ‌కాశం ఉన్నాయ‌ని స‌ర్వే లో తెలింద‌ని ఎంపీ అర‌వింద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news