అనంతపురంలో విద్యుత్ తీగలు మీదపడి ఆరుగురు మృతి

-

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం దర్గాహొన్నూరులో కూలి పనుల కోసం వచ్చిన వారిని విద్యుత్ తీగలు మింగేసాయి. పంట కోస్తున్న సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరి కొంతమంది గాయాల పాలయ్యారు.

దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news