స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో వెండి..!

-

బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. గత మూడు రోజులుగా ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. బంగారం బాటలోని వెండి కూడా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగడంతో ధర రూ.43,680కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరగడంతో ధర రూ.44,680కి చేరింది.

 

గోల్డ్
గోల్డ్

 

10 గ్రాముల బంగారం ధర..
రాష్ట్రాల వ్యాప్తంగా బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నై పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,210 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,050కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,680 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,680కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160కి చేరింది. కోల్‌కతా పట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,760కి చేరింది. బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,820 గా ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,820కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో హైదరాబాద్‌లో కొనసాగిన ధరలే కొనసాగాయి.

కేజీ.. వెండి ధర..
బంగారం ధరతోపాటు వెండి ధర కూడా పెరుగుతూ వచ్చాయి. నిన్నటి నుంచి వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధరకు రూ.900 పెరగడంతో ధర రూ.71,000కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీకి రూ.800 పెరగడంతో రూ.66,500కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news