టూర్‌ మధ్యలోనే హైదరాబాద్‌కు వచ్చేసిన సీఎం కేసీఆర్‌.. ఎందుకు..?

-

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌తో భేటీ అయ్యారు. 21న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. 22న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి చండీగఢ్ చేరుకున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అక్కడి వరకు పర్యటన సజావుగానే సాగింది.

Telangana: CM KCR Extends Lockdown In The State To May 30

అయితే, ఏమైందో ఏమో కానీ.. నేడు, రేపు పలువురు ప్రముఖులతో జరగాల్సిన చర్చలు, భేటీలను రద్దు చేసుకుని అర్ధంతరంగా హైదరాబాద్ చేరుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, ఈ నెల 25న కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. అలాగే, 27న మహారాష్ట్రలోని రాలెవగావ్ సిద్ధి వెళ్లి అన్నాహజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news