కంట్రీకి నీచులు, అరిచే కుక్కలు : కమ్యూనిస్టులపై సోము వీర్రాజు సంచలనం

-

కంట్రీకి నీచులు, అరిచే కుక్కలు అంటూ కమ్యూనిస్టులపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనియన్లు పెట్టి పాఠశాలలను కమ్యూనిస్టులు సర్వనాశనం చేశారని.. నిప్పులు చెరిగారు. ఇవాళ బీజేపీ పార్టీ సభలో ఏపీలో జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ పార్టీలు బూర్జువా పార్టీలు అని.. కమ్యూనిస్టులు బార్కింగ్ డాగ్స్ అంటూ నిప్పులు చెరిగారు. ట్రేడింగ్ పార్టీలకు కమ్యూనిస్టులు ఏజెంట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల కోసం.. ఆవేదన, ఆలోచన కలిగిన పార్టీ బీజేపీ పార్టీ చెప్పారు. మడమ తిప్పని వాడు.. మాట తప్పని వాడు.. ఏపీకి రాజధాని లేకుండా చేశారని సీఎం జగన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను దోచుకునేందుకు విశాఖ చుట్టూ గద్దల్లా తిరిగుతున్నారు వైసీపీ నేతలని ఫైర్‌ అయ్యారు. ప్రజాగ్రహ సభ అంటే కొందరికి కాలాల్సిన చోట కాలిందని..పేర్ని నాని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. జగన్ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ సభ పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారని మండిపడ్డారు. అందరికీ ఏం చూపించాలో.. అంతా చూపిస్తామని.. మీకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో అన్నీ తేలుస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news