మోడీ నా సూచనలు ఫాలో అవ్వండి… సోనియా చేసిన సూచనలు ఇవే…!

-

కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు సరిపోయే అవకాశం లేదని, ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధినేత్ర్ సోనియా గాంధి ప్రధాని నరేంద్ర మోడికి ప్రధానంగా 5 సూచనలు చేసారు. ప్రభుత్వ ఖజానా ఆదా కావాలి అంటే… వాటిని అమలు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఆ డబ్బుతో కరోనా కోపం ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలును కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ సోనియా కు ఇటీవల ఫోన్ చేసిన సంగతి తెలిసిందే.

1. రెండేళ్ల పాటు మీడియా అడ్వర్టైజ్‌‌మెంట్లపై నిషేధం విధించాలని ఆమె సూచించారు. పత్రికలు, టీవీ, డిజిటల్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రకటనలను నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.1250 కోట్లు ప్రకటనల కోసం ఖర్చుపెడుతోందని ఆమె ప్రస్తావించారు.

2. రూ.20వేల కోట్లతో చేపట్టిన నూతన పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత చారిత్రాత్మక పార్లమెంటులోనే కార్యకలాపాలు కొనసాగించాలని అన్నారు. ఆ డబ్బుతో నూతన ఆస్పత్రులు నిర్మించడం తో పాటుగా డాక్టర్లకు PPEలు అందించవచ్చు.

3. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మినహా ఇతర బడ్జెట్ వ్యయాన్ని 30శాతం తగ్గించుకోవాలని… తద్వారా ఏటా 2.5 లక్షల కోట్లు మిగలుతాయని ఆమె పేర్కొన్నారు. వాటిని లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీల సంక్షేమం కోసం వినియోగించవచ్చని ప్రస్తావించారు.

4. రాబోయే రోజుల్లో ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రలు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలని ఆమె సూచించారు.

5. పీఎం కేర్స్ నిధిని మొత్తం పీఎం నేషనల్ రిలీఫ్ బండ్‌కు బదలాయించాలని… పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ఆ నిధులను ఖర్చుచేయాలని సూచించారు. 2019కి సంబంధించి రూ.3800 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ వద్ద ఉన్నాయన్న ఆమె దీనితో పాటు పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులను ఆహార భద్రత కోసం వినియోగించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news