చంద్రబాబు ఏపీకి పట్టిన శని – స్పీకర్ తమ్మినేని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు ఏపీకి పట్టిన శని గ్రహం అని విమర్శించారు. చంద్రబాబు మీటింగ్ పెడుతుంటే జనాలు చనిపోతున్నారని.. ఎన్టీఆర్ పెట్టిన గుర్తు సైకిల్ కాకుండా చంద్రబాబు పీనుగా గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు. అందరి సభలకు ప్రజలు వస్తున్నారని.. చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదన్నారు.

tammineni sitaram

ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు మరింత దిగజారుతున్నారని దుయ్యబట్టారు. టిడిపి హయాంలో పింఛను కోసం అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వెండినేటర్ పై ఉన్న రాజకీయ నాయకుడు అని.. ఆ వెంటిలేటర్ తీసేసి ప్రజలు ఈ రాష్ట్రానికి పట్టిన శని, కర్మ వదిలించుకున్నారని సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news