5 వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం..

-

ఛటోగ్రామ్ : తొలి టెస్టు లో టీమిండియా పట్టు బిగించింది. ఈ నేపథ్మంలోనే ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో భారత్ కు 254 పరుగులు లీడ్ లభించింది.

ఓవర్ నైట్ స్కోర్ 133/8 తో మూడో రోజు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ ను కుల్దీప్ యాదవ్ దెబ్బ కొట్టాడు. ఎబాధత్ హుస్సేన్ (17) అవుట్ చేశాడు.

దీంతో బంగ్లా 144 పరుగులకే 9వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఖలీద్ అహ్మద్ దకౌట్ గా వెనుతిరగడంతో బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇక టీమిండియా కాసేపటి క్రితమే తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా ప్రారంభించేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news