IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం

-

భారత్ తో జరుగుతున్న 5వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. 378 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 259/3 తో ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన స్టోక్స్ సేనా మరో వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. జో రూట్, బెయిర్ స్టో మంచి భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు.

రూట్ 173 బంతుల్లో19 ఫోర్లు, 1 సిక్సర్తో 142 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ తో బెయిర్ స్టో మరోమారు సెంచరీ చేశాడు. 147 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ తో 114 పరుగులు చేశాడు. వికెట్లు తీయడంలో విఫలమైన భారత బౌలర్లు ఒత్తిడి పెంచి లేకపోయారు. నాలుగో రోజు వరకు పటిష్ట స్థితిలోనే కనిపించిన భారత్ ఆ తర్వాత మాత్రం క్రమంగా ఓటమి అంచులకి చేరుకుంది. ఫలితంగా అందినట్టే అందిన విషయం భారత్ చేజారింది.

Read more RELATED
Recommended to you

Latest news