ముంబై ఫైనల్ కు వస్తే నాకు భయం: చెన్నై కోచ్ డ్వెయిన్ బ్రావో

-

ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా ప్రస్తుతం ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పటికి క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ పై గెలిచిన చెన్నై ఫైనల్ కు చేరగా, గత రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో ను చిత్తు చిత్తు గా ఓడించి ముంబై క్వాలిఫైయర్ 2 కు చేరుకుంది. ఇక రేపు జరగనున్న క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. అయితే ఇప్పుడు ముంబై రాత్రి గెలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ గా ఉన్న డ్వెయిన్ బ్రేవో కీలక వ్యాఖ్యలు చేశాడు. వస్తావంగా ముంబై ఓడిపోవాలని అనుకున్నాను.. వీళ్ళు ఫైనల్ కు కనుక చేరుకుంటే మాకు భయం అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

కాగా రేపు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయాన్ని సాధిస్తే ఆదివారం జరుగనున్న ఫైనల్ లో చెన్నై తలపడనుంది. మరి రేపటి మ్యాచ్ లో ఎవరు విజయం సాధించనున్నారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news