90 పరుగుల దూరంలో రోహిత్ శర్మ.. లిస్టులో చేరిన మూడవ వాడిగా.

-

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్లో మరో మైలు రాయిని చేరుకోనున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించినవాడిగా కోహ్లీ రికార్డుకెక్కాడు. 178మ్యాచులాడిన కోహ్లీ 5426పరుగులతో ముందున్నాడు. ఆ తర్వాత స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. మూడవ స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. 4910పరుగులతో ఉన్న మూడవ స్థానంలో ఉన్న మరో 90పరుగులు చేస్తే 5వేల పరుగుల క్లబ్ లో చేరిన ముడవ ఆటవగాడిగా గుర్తింపు దక్కించుకుంటాడు.

ఐతే నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగనున్న మ్యాచులో ఈ ఫీట్ అందుకుంటాడేమో చూడాలి. ఇప్పటి వరకు 189మ్యాచులాడిన రోహిత్ శర్మ 4910పరుగులు చేసాడు. ఇదే కాదు ఐపీఎల్ లో 200సిక్సర్ లు బాదిన నాలుగవ ఆటగాడిగా గుర్తింపు పొందనున్నాడు. అందుకోసం మరో ఆరు సిక్సర్ లు అవసరం. 326సిక్సర్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో డివిలియర్స్(214) మూడవ స్థానంలో ధోనీ(209) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news