ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎస్‌కే

-

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని dhoni బుధవారం తన 40వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక ధోని వయసు పెరగడంతో ఐపీఎల్లో ఎన్ని రోజులు కొనసాగుతాడనేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎస్‌కేకు మరో రెండేళ్లు ఎంఎస్‌ ధోనీయే సారథ్యం వహిస్తాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు.

ధోని/ dhoni
ధోని/ dhoni

ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని కాశీ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. మహీ కఠోరంగా శ్రమిస్తున్నాడని, అతడెందుకు ఆగిపోవాలి? ప్రశ్నించారు. ధోని ఆగిపోయేందుకు కారణాలేమీ కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం ధోనీ సీఎస్‌కేకు చేస్తున్న దానిపట్ల తాము సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. ధోనీ కేవలం సారథి మాత్రమే కాదని, అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు, నాయకుడు, మార్గ నిర్దేశకుడు, గొప్ప ఫినిషర్‌ అని ప్రశంసించారు. అతనిప్పటికీ జట్టుకు ఎంతో విలువ తీసుకొస్తాడనే తమకు నమ్మకం ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news