కెప్టెన్ గా మొదటి టాస్ ఓడిపోయిన సూర్య..!

-

భారత జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ తన మొదటి టాస్ ఓడిపోయాడు. శ్రీలంకతో ఈ రోజు జరగనున్న మొదటి t 20 మ్యాచ్ లో లంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్ గా ఇదే మొదటి మ్యాచ్ అనేది అందరికి తెలిసిందే. అయితే రోహిత్ తర్వాత కెప్టెన్ అవుతాడు అనుకున్న హార్దిక్ పాండ్య ఫిట్నెస్ సమస్యల వల్ల ఈ సిరీస్ లో మాములు ప్లేయర్ గా ఆడాల్సి వస్తుంది.

ఇక ఈ మ్యాచ్ లో లో ఉన్న ప్లేయింగ్ 11 చూస్తే.. గిల్, జైస్వాల్, సూర్య, పంత్, రియాన్ పరాగ్, పాండ్య, అక్షర్, బిష్ణోయ్, అర్షదీప్, సిరాజ్ ఉన్నారు. ఎన్నో రోజుల నుండి జట్టులో ఉంటున్న ప్లేయింగ్ 11 లోకి రాలేకపోతున్న సంజూ కు ఈ మ్యాచ్ లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.

Read more RELATED
Recommended to you

Latest news