IND VS IRE : ఐర్లాండ్‌పై టీమిండియా ఘన విజయం

-

ఐర్లాండ్ లో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ జట్టుపై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత ఐర్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.

ఐర్లాండ్ జట్టులో టాపార్డర్ రాణించింది. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, ఆవేష్ ఖాన్, చాహల్‌ తలో వికెట్ తీశారు. ఇంకా 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా…9.2 అవ్వ లోని మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

భారత బ్యాట్స్మెన్లలో… దీపక్ హూడా 47 పరుగులు, కిషన్ కిషన్ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 24 పరుగులతో రాణించారు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమ్ ఇండియా యువ జట్టు ఐర్లాండ్ తో… చిట్టచివరికి టి20 మ్యాచ్ లో రేపు తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news