BREAKING : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు కరోనా పాజిటివ్

-

టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇటీవల గాయం కారణంగా ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ కు తాజాగా కరోనా సోకింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేఎల్‌ రాహుల్‌ కు పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో త్వరలో వెస్టిండీస్‌ తో జరిగే టీ 20 సిరీస్‌ లో రాహుల్‌ ఆడేది అనుమానం మారింది. ముంబై బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగిన సందర్భంగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఈ మేరకు ప్రకటన చేశారు.

ఇది ఇలా ఉండగా..ఇంగ్లాండ్‌ టూర్‌ ముగించుకున్న టీమిండియా.. అక్కడి నుంచే నేరుగా వెస్టిండీస్‌ టూర్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో 3 వన్డేలు ఆడనుంది టీమిండియా. అయితే.. ఈ సిరీస్‌ కు కోహ్లీ, రోహిత్‌, పంత్‌, బుమ్రా లాంటి ప్లేయర్లకు రెస్ట్‌ ఇచ్చారు. దీంతో ధవన్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news