సిరాజ్‌కు జూబ్లీ హిల్స్ లో 600 గ‌జాల స్థ‌లం కేటాయింపు..!

-

భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం తెలంగాణ తరపున ఆడుతున్న ఏకైక ఆటగాడు మహమ్మద్ సిరాజ్. అయితే ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో.. భారత జట్టు తరపున ఆడిన సిరాజ్.. జట్టు విజేతగా గా నిలవడంలో తన వంతు పాత్ర అనేది పోషించాడు అనేది అందరికి తెలిసందే. భారత జట్టు అమెరికాలో ఆడిన మ్యాచ్ ల్లో తుది జట్టులో ఉన్న సిరాజ్.. విండీస్ లో మాత్రం జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఇక ఛాంపియన్ గా తిరిగి వచ్చిన సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన జెర్సీని కూడా అందించాడు.

ఇక ఆ క్రమంలోనే సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా ఇంటి స్థలం కూడా ఇస్తాం అని సీఎం ప్రకటిచారు. అయితే తాజాగా మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు జూబ్లీ హిల్స్ లో 600 గ‌జాల స్థ‌లం కేటాయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news