నేడే ఇండియా, సౌతాఫ్రికా ల మధ్య మూడో టీ20, విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

-

విశాఖ : నేడే ఇండియా, సౌతాఫ్రికా ల మధ్య మూడో టీ20 ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిన కీలక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. మరి కాసేపట్లో రాడిసన్ హోటల్ నుండి స్టేడియంకు ఇరు జట్లు చేరుకోనున్నాయి.

అనంతరం నెట్ ప్రాక్టీస్ చేయనున్నాయి ఇండియా సౌతాఫ్రికా జట్లు. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు విశాఖ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. మ్యాచ్ సందర్బంగా సుమారు 1500 మందితో భారీగా పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేశారు. అటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన apsrtc..అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ మూడో టీ 20,,,రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ లు గెలిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news