పిచ్చి నా కొడుకా..ఎవడ్రా నీకు అధ్యక్ష పదవీ ఇచ్చింది – బండి సంజయ్ కి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

-

పిచ్చి నా కొడుకా..ఎవడ్రా నీకు అధ్యక్ష పదవీ ఇచ్చిందని బండి సంజయ్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని.. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా?
30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారన్నారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారు… చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారని అగ్రహించారు.

బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను వాడు, వీడు అని సంబోధిస్తావా ? ఒక లుచ్చా, సైకోలా మాట్లాడుతున్నావ్… ఎవడ్రా నీకు అధ్యక్ష పదవీ ఇచ్చిందని రెచ్చిపోయారు. గతంలో ఉన్న అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ హుందాగా మాట్లాడారు… నీ అయ్యా, అబ్బా చెప్పాడ్రా పిచ్చి నా కొడక… నీ నాలుక కోస్తాం బిడ్డా అని హెచ్చరించారు.

కౌన్సిలర్ స్థాయి నీది… తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్. నీ కుటుంబ సభ్యుల జోలికి వచ్చామా? అని అగ్రహించారు. పాదయాత్రలో మధ్యలో బిల్డర్ లకు ఫోన్లు చేసి వచ్చేది మా ప్రభుత్వమే అని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు… ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతావా? అని అగ్రహించారు. నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారు… కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారన్నారు. 20 వేల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందో చెప్పు… బీజేపీ జూట పార్టీ అని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news