SSLV-D2 ప్రాజెక్టుకు ఇస్రో సిద్ధం, అంతరిక్షంలోకి మరో మూడు ఉపగ్రహాలు

-

ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(SHAR)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రేపు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2(PSLVD2) రాకెట్‌ మూడు ఉపగ్రహాలను మోసుకొని ఆకాశంలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండవ ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం సఫలం కాకపోవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ఈ సారి ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు.

దాదాపు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.ఈ సారి టార్గెట్‌ ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం.

ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా పరీక్షిస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో జరుగనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news