గుడ్ న్యూస్.. వారికి రూ.8 లక్షల వరకు లోన్.. బ్యాంక్ కి వెళ్లకుండానే..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని తీసుకు వస్తోంది. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. ఓ అద్భుతమైన ఆఫర్ ని స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే.. వారు వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రి అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ ని కస్టమర్స్ కోసం ఇస్తోంది. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఈ లోన్ ని పొందొచ్చు. పైగా మీకు డబ్బులు క్షణాల వ్యవధిలోనే మీ బ్యాంక్ ఆకౌంట్ లో పడతాయి. స్టేట్ బ్యాంక్ ప్రత్యేక సేవలు కూడా అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ని పొందొచ్చు. పర్సనల్ లోన్స్ కింద బ్యాంక్ నుంచి రూ. 35 లక్షల వరకు లోన్ ని కస్టమర్స్ పొందొచ్చు. అర్హత వున్నవాళ్లు ఈ లోన్ ని పొందొచ్చు.

ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ అర్హత ఉంటే రూ. 8 లక్షల వరకు లోన్ వస్తుంది. దీని కోసం బ్యాంక్ కి వెళ్లాల్సిన పనే లేదు. యోనో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ డబ్బులు వెంటనే మీ అకౌంట్‌ లోకి వచ్చేస్తాయి. చాలా ఈజీగానే ఈ అమౌంట్ ని మీరు పొందొచ్చు. ట్విట్టర్ వేదికగా స్టేట్ బ్యాంక్ ఈ విషయాన్ని చెప్పింది.

లోన్ వస్తుందా లేదా అనేది ఇలా తెలుసుకోండి:

ఎస్‌బీఐ కస్టమర్లు పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసేయండి.
ఇలా మీరు 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేసేయండి చాలు.
మీకు లోన్ వస్తుందా లేదా అనేది ఇలా చూసేయచ్చు.
కావాలంటే మీరు యోనో యాప్ ద్వారా కూడా చూసేయచ్చు.
యోనో యాప్‌లోకి వెళ్ళాక.. మీకు ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంటే కనిపిస్తుంది. లేదంటే రాదు.
ఒకవేళ ప్రిఅప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంటే దీనిపై క్లిక్ చేయాలి.
ఎంత లోన్ అవసరమో మీరు ఎంచుకోవాలి.
తరవాత టెన్యూర్ ఎంపిక చేసుకోవాలి.
వడ్డీ రేటు, ఈఎంఐ వంటివి మీరు చెక్ చేసుకోవాలి.
ఆ తరవాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అంతే డబ్బులు పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news