బీజేపీ నేతలు సైకోలుగా తయారవుతున్నారు… ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు – విప్ బాల్క సుమన్.

-

బీజేపీ నాయకులు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైరయ్యారు. బీజేపీ ఏంపీలు సైకోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. బండి సంజయ్, అరవింద్ లు మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే ప్రజలు తరిమికొడుతారని హెచ్చిరించారు. తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారన్నారు. తెలంగాణ రైతులే మీకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని.. మీకు మూడింది.. టైం దగ్గర పడిందని తీవ్ర స్థాయిలో హెచ్చిరించారు. బాయిల్డ్ రైస్ కొంటారో కొనరో చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు. మీరు ఢిల్లీలోనే ఉన్నారు కదా.. కేంద్రాన్ని అడుగవచ్చు కదా అని బీజేపీ ఎంపీలకు సూచించారు. గతంలో బీజేపీ పార్టీ నుంచి దత్రాత్రేయ, సాగర్ జీ వంటి వారు ఎంత హుందాగా ఉండే వారు… అలాంటిది ఇప్పుడు బీజేపీ నేతలు చిల్లరగాళ్లలా, థర్డ్ క్లాస్ మనుషులుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, ఎంపీలను దద్దమ్మలు అనే అంటాం అని మరోమారు స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 14 ఏళ్లు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణను సాధించారని.. 7 ఏళ్లుగా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలిస్తున్నారని.. అలాంటి వ్యక్తిపై ఏకవచనంతో సంబోధిస్తున్నారని.. ఇది తెలంగాణ ప్రజానీకం గమనిస్తుందిని..మీమ్మల్ని వదిలిపెట్టరని బాల్కసుమన్ హెచ్చరించారు. హైదరాబాాద్, తెలంగాణ ఇమేజ్ పెరగడం చూసి కళ్లు ఓర్వలేకనే బీజేపీ బద్నాం చేస్తుంన్నారు బాల్క సుమన్.

 

Read more RELATED
Recommended to you

Latest news