సునీల్‌ కొనుగోలు అవుట్‌.. కాంగ్రెస్ వార్ రూం హెడ్‌గా మాజీ ఐఏఎస్

-

కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ మీద మరో షాక్.. సునీల్ కనుగోలు దూరం ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి నోరు జారితే జరిగిన నష్టాన్ని కవర్ చేయలేదని కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్ సునీల్ కనుగోలుని పిలిచి చీవాట్లు పెట్టిన రేవంత్ రెడ్డి. మనస్తాపంతో అలిగి కర్ణాటకకు వెళ్లిపోయిన సునీల్. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కాస్త పెరిగింది అని సంబరపడే లోపే రేవంత్ ఉచిత కరెంట్ ఒక్కసారిగా పడిపోవడంతో సునీల్ కనుగోలు స్థానంలో కాంగ్రెస్ వార్ రూం హెడ్ బాధ్యతలు మాజీ ఐఏఎస్ శశికాంత్ సెంథిల్ కుమార్‌కు అప్పగించనున్నారు.

Telangana HC refuses to stay CCS notice to Sunil Kanugolu

ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మందుల సామెల్, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత, రామారావు పటేల్ తో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి చెందిన పలువురు నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టికెట్లపై కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news