క్షుద్ర పూజలు కాదు..కేసీఆర్‌ హోమాలు, యజ్ఞలు చేసాడు – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

తెలంగాణ ముఖ్యమంత్రి పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. బండి సంజయ్ కి మతి భ్రమించిందని నిప్పులు చెరిగారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షుద్రపూజలు ఎవరు చేస్తున్నారు? బీజేపీ వాళ్లే క్షుద్రపూజలు చేస్తున్నారన్నారు.

బండి సంజయ్ ఎం మాట్లాడుతున్నారో కూడా తనకు తెలియదని.. ఎంపీగా ఉండి బండి సంజయ్ పిచ్చి కూతలు కూస్తున్నారని నిప్పులు చెరిగారు. మూడేళ్ల క్రింద ఒప్పందం ప్రకారం రాజగోపాల్ రెడ్డి పార్టీ లో చేరాడని..కాంట్రాక్టుల కోసం పార్టీ లో చేరాడని ఆగ్రహించారు. బండిసంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి యాగాలు చేశాడని… ప్రజలు, లోక కల్యాణం కోసం హోమాలు యజ్ఞలు చేసాడన్నారు.నీకు దమ్ముంటే కరీంనగర్ కు ఏమి చేశావో చెప్పు అని సవాల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news