చింత గింజలతో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..పొడి చేసి వాడేయండి..!

-

చింతపండు..అసలు ఈ పేరువింటనే నోట్లే నీళ్లు ఊరుతాయి కదా..ఊర్లలో చింతకాయలు ఉంటాయ్..చిన్నప్పుడు భలే తినేవాళ్లం..ఇంకా ఆ గింజలతో అష్టాచమ్మా లాంటి ఆటలు కూడా ఆడిన జ్ఞాపకమే..చింతపండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలుసు..కానీ మనందరికి తెలియని మరో విషయం ఏంటంటే..చింతగింజలు కూడా అంతే మేలు చేస్తాయి. మనం మార్కెట్ లో చింతపండును కొనేప్పుడు ఏరికోరి గింజలు లేనిదే తీసుకుంటాం. దాని ధర ఎక్కువైనా సరే.. ఎందుకంటే.. గింజలతో ఏం ఉపయోగం అని. కానీ ఈరోజు మనం చింతగింజలతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

సహజంగా చింతకాయలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చింత గింజల్లో ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చింతగింజల్లో ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కావున చింత గింజలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. ప్రతిరోజు చింత గింజల పొడిని పాలు లేదా నీళ్లలో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

చింత గింజల్లో పొటాషియం అధికంగా అధికంగా ఉంటుంది. ప్రతిరోజు చింత గింజల పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

చింత గింజల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయట.

ఈ గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థని మెరుగు పరుచుకోవడానికి సహాయ పడటమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.

చింత గింజలపై పొట్టు తీసి మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ తయారీలో కూడా వినియోగిస్తారు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్య ఔషధం. చింతగింజల పొడిని ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ కలిపి రోజుకి రెండుసార్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించే ప్రమాదకర డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

చింత గింజల పొడిని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి అవుతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తంగా విముక్తి పొందవచ్చు.

చింతగింజలను వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన ఉండదు.

చింతగింజల పొడి తయారుచేసే విధానం..

నాణ్యమైన చింత గింజలను సేకరించి దోరగా వేయించి మెత్తటి పొడితయారు చేసుకోవాలి. మిక్సీలో వేస్తే బ్లేడ్ విరిగిపోయే ఛాన్స్ ఉంది..ముందు రఫ్ గా వాటిని రోట్లో లేదా..ఒక రాయితో విరగకొట్టి ఆపై మిక్సీలో వేస్తే..మొత్తగా అవుతుంది. తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news