చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు.. ఏపీ డీజీపీకి టీడీపీ లేఖ

-

అమరావతి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ డీజీపీకి లేఖ రాశారు.

chandrababu
chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంఘ విద్రోహ శక్తులు నుంచి ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు వర్ల రామయ్య. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందని లేఖలో వివరించారు వర్ల రామయ్య.

ఇప్పటికే పార్టీ కార్యాలయంపై దాడి చేశారని గుర్తు చేశారు. పార్టీ కార్యాలయానికి 24 గంటల పాటు సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో డీజీపీని డిమాండ్‌ చేశారు వర్ల రామయ్య. ముఖ్యంగా వైసీపీ నేతల నుంచి తమకు ప్రమాదం ఉందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news