కుప్పంకు విరుగుడు పులివెందుల..!

-

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజకీయాల్లో వినిపించిన పేరు కుప్పం. సాధారణంగా కుప్పం పేరు పెద్దగా మీడియాలో రాదు. ఏదో గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కుప్పం గురించి వార్తలు వచ్చేవి గాని…అక్కడ రచ్చ జరుగుతున్నట్లు కథనాలు రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ పరిస్తితి మారింది. కుప్పంని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతూ వస్తుంది…లోకల్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇంకా అసెంబ్లీ  ఎన్నికల్లో చంద్రబాబుని చిత్తు చేస్తామని వైసీపీ అంటుంది.

ఇటు వైసీపీ దెబ్బకు చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యారు..అసలు నామినేషన్‌కు వెళ్లకుండా స్థానిక నేతల చేత నామినేషన్ వేయించి గెలిచే బాబు…చాలా రోజుల నుంచి కుప్పంపై ఫోకస్ పెట్టారు. రెండు, మూడు నెలకొకసారి కుప్పం వెళుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో తిరిగారు. అప్పుడు వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎంత రచ్చ జరిగిందో చెప్పాల్సిన పని లేదు.

అయితే వైసీపీ పూర్తిగా కుప్పంని టార్గెట్ చేసి రాజకీయం చేస్తుంది. అంటే కుప్పంలోనే టీడీపీ పని అయిపోయింది…ఇంకా రాష్ట్రంలో ఏం ఉంటుందనే విధంగా రాజకీయం చేస్తుంది. వైసీపీ నేతలు పదే పదే కుప్పం గురించి మాట్లాడుతూ వస్తున్నారు..అక్కడ బాబు పని అయిపోయిందని, నెక్స్ట్ ప్రజలు చిత్తుగా ఓడిస్తారని అంటున్నారు. ఇలా వైసీపీ నేతలు కుప్పంని టార్గెట్ చేయడంతో ఇప్పుడు టీడీపీ రివర్స్ అయింది.

టీడీపీ నేతలు పులివెందుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు..అసలు వైసీపీ పని అయిపోయిందని, పులివెందులలోనే జగన్ గెలిచే పరిస్తితి లేదని అంటున్నారు. తాజాగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పులివెందుల గురించి ప్రస్తావన వచ్చింది. ఇలాగే జగన్ ముందుకెళితే..పులివెందులలో కూడా గెలవరని చంద్రబాబు మాట్లాడారు. అలాగే అక్కడ టీడీపీ బలం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అంటే వైసీపీ నేతలు కుప్పం గురించి మాట్లాడితే పులివెందులతో టీడీపీ కౌంటర్ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news