ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి పోలిట్ బ్యూరో భేటీ

-

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభమైంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ పునరుద్ధరణ పై చర్చించే అవకాశం ఉంది. అలాగే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు స్నేహపూర్వక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తోందట.

ఇక ఈ సమావేశంలో 20 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టం, సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news