నా పాస్ పోర్ట్ కేసు కి గురువులు..హరీష్ ..కేసీఆర్ లే: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

నా పాస్ పోర్ట్ కేసు కి గురువులు.. మంత్రి హరీష్ .. సిఎం కేసీఆర్ లే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని హితవు పలికారు. ఇంకోసారి ఉత్తమ్ మీద మాట్లాడితే… నీకంటే ఎక్కువ మాట్లాడతం అని వార్నింగ్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి… స్టేట్మెంట్స్ బాధ కలిగించింది అని అన్నారు. నెహ్రు గురించి మాట్లాడిన మాటలు ఇబ్బందిగా అనిపించింది అని పేర్కొన్నారు.

క్యారెక్టర్ లేని జగదీష్ రెడ్డి… క్యారెక్టర్ ఉన్న నెహ్రూ మీద కామెంట్స్ చేయడమా..? అని నిలదీశారు. జగదీష్ రెడ్డి క్యారెక్టర్ ఏందో బయటపెడతా అని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం మీద విచారణ కోరితే తప్పేంది..? అని నిలదీశారు. నోరుంది కదా అని మాట్లాడొద్దు అని హెచ్చరించారు. కరెంట్ మినిష్టర్ వే కానీ… ని దగ్గర పవరే లేదు అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ విస్కీలో సోడా లు కలిపే నువ్వా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మాట్లాడేది..? అని నిలదీశారు. ఉత్తమ్ కెప్టెన్ … నువ్వు సాదాసీదా అడ్వకేట్ వి అని వార్నింగ్ ఇచ్చారు.

మేము తలుకుంటే .. నువ్వు తిరగగలుగుతావ..? అని ప్రశ్నించారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక… నీ సంగతి తెలుస్తాం అని ఆయన అన్నారు. ని చిట్టా అంత బయట పెడతాం అని వార్నింగ్ ఇచ్చారు. మినిష్టర్ పోస్ట్ ఉంది కదా అని పోజులకు పోకు..? అని హెచ్చరించారు. కేసీఆర్ మీద 45 ఏండ్ల క్రితమే కేసులు అయ్యాయి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news