తెలంగాణ, ఏపీ సీఎంలకు థాంక్స్ చెప్పిన డైరెక్టర్ రాజమౌళి

-

తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ఇటు తెలంగాణ, అటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నాయి. థియేటర్లలో ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. టికెట్ రేట్లపై అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నాయి. 

తాజాగా టాలీవుడ్ పరిశ్రమ సమస్యలను పరిష్కరించినందుకు రాజమౌళి ఇరు రాష్ట్రాల సీఎంలకు థాంక్స్ చెబుతూ… ట్విట్ చేశారు. పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి  ధన్యవాదాలు, మాకు నిరంతరం మద్దతు ఇచ్చారిన.. ఇది సినీ పరిశ్రమకు పెద్ద ఊరట అని ఆయన ట్విట్ చేశారు. కొత్త జీవో ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు రాజమౌళి. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నానని ట్విట్ చేశారు.

ఏపీలో చాలా రోజులుగా టికెట్ రేట్లపై ప్రభుత్వం, టాలీవుడ్ కు మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ ని కూడా కలిశారు. తాజాగా టికెట్ రేట్లను సవరిస్తూ.. జీవో తీసుకువచ్చారు. దీనిని సినీరంగం స్వాగతించింది.

Read more RELATED
Recommended to you

Latest news