తెలంగాణలో మళ్లీ డబుల్‌ సెంచరీ కొట్టిన కరోనా కేసులు..

-

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ డబుల్‌ సెంచరీ కొట్టాయి. కానీ.. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 21,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 132 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నిన్న 164 కేసులు వెలుగుచూడగా, నేడు తక్కువగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, హనుమకొండ జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

Corona Virus Update: Active COVID-19 cases in country rise to 19,719 | Zee  Business

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 63 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇంకా 1,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,111. తెలంగాణలో నేటివరకు 7, 95,008 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,496 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news