తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు

-

ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 21,616 శాంపిల్స్ పరీక్షించగా, 441 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 292, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, రంగారెడ్డి జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

Immunity passports" in the context of COVID-19

అదే సమయంలో 692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,09,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,01,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇంకా 4,649 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news