పెండింగ్​ బిల్లులపై త్వరలో నిర్ణయం తీసుకుంటా : తమిళిసై

-

అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలో ఉంటుందని గవర్నర్ తమిళిసై అన్నారు. పెండింగ్​లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాజ్ భవన్​లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్​తో మీడియా ప్రతినిధులు ముచ్చటించారు. గవర్నర్​గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని తమిళిసై తెలిపారు. తనకు ఉన్న పరిధికి లోబడే నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు.

అంతకుముందు రాజ్​భవన్​లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. పండుగ సందర్భంగా గవర్నర్ దంపతులను కలిసేందుకు సామాన్యులు తరలివచ్చారు. వారిని గవర్నర్ దంపతులు కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైతే బూస్టర్ డోస్ తీసుకోలేదో, వెంటనే తీసుకోవాలని సూచించారు. మంచి ఆరోగ్యకరమైన భోజనం చేస్తూ.. జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇవాళ టపాసులు కాలుస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news