తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్

-

తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రోజుకు వెయ్యి మందికి 300 రూపాయల దర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టిసి ఎండి సజ్జానార్ ప్రకటించారు. రోజుకు వెయ్యి మందికి టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అంగీకారం తెలిపారు.

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కావాలి అనుకున్న వారు… ప్రయాణానికి రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సులో టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి వుంటుందని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. తెలంగాణ ఆర్టీసీ చేసిన ఈ ప్రకటనపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్లు మరిన్ని ప్రకటిస్తే బాగుంటుందని.. భక్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news