తెలంగాణకు వర్ష సూచన… చల్లని కబురు చెప్పిన వాతావరణ కేంద్రం

-

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను కూడా దాటుతున్నాయి. పూర్తిస్థాయిలో ఎప్రిల్, మే మాసాలు రాకముందే తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయాల్లో బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఇదిలా ఉంటే వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. 

ఈ రోజు నుంచి రేపు, ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. నేడు, ఎల్లుండి రాష్ట్రంలో తేలిక పాటి నంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురుస్తామని వెల్లడించింది. రేపు మాత్రం రాష్ట్రంలో పొడివాతావరణ నెలకొని ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతా నుంచి తెలంగాణ మీదుగా దక్షిన తమిళనాడు వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు ఇది బలహీన పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా మీదుగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version