తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా క‌రోనా.. నేడు 24 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త రెండు రోజుల నుంచి పెరిగిన క‌రోనా కేసులు ఈ రోజు స్వ‌ల్పంగా త‌గ్గాయి. కాగ ఈ రోజు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను కాసేప‌టి క్రితం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు… 16,580 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ పరీక్షల‌ల్లో మొత్తం 24 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య‌.. 7,91,485 కు చేరింది. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా నుంచి 40 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 232 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అయితే గ‌త రెండు రోజుల నుంచి తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా కరోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. అయితే ఈ రోజు కేసుల సంఖ్య రాష్ట్రంలో స్వ‌ల్పంగా త‌గ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news