హైకోర్ట్ ఆవరణలో యువకుడి దారుణ హత్య

-

నేడు తెలంగాణ హైకోర్టు వద్ద యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. హైకోర్టు గేటు నెంబర్ 6 దగ్గర ఈ ఘటన జరిగింది. మృతుడు సులబ్ కాంప్లెక్స్ లో పనిచేసే మిథున్ గా పోలీసులు గుర్తించారు. రూ. 10 వేల విషయంలో వీరి ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది.

ఆ ఘర్షణ కాస్త హత్యకు దారి తీసింది. హత్య తర్వాత నిందితుడే పోలీసులకు ఫోన్ చేసి వారి ఎదుట లొంగిపోయాడు. ఈ హత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news