అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీంలో కేసు వేస్తా – షబ్బీర్ అలీ

-

చేవెళ్ల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ప్రకటించిన అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోం మంత్రి ఒక వర్గానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా..? బిజెపి రాజ్యాంగం నడుస్తుందా..? అని ప్రశ్నించారు.

ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామరడం బిజెపి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు షబ్బీర్ అలీ. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా హోం మంత్రి పదవికి అన్ ఫిట్ అని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్లను తొలగించడం అమిత్ షా తరం కాదని ఫైర్ అయ్యారు. మతపరంగా ముస్లింలను శత్రువులుగా చూస్తే ఎలా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news