రాయలసీమను తెలంగాణలో కలపాలి – జేసీ దివాకర్ రెడ్డి

-

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని అన్నారు జెసి. అప్పుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాయలసీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రత్యేక రాయలసీమని సాధించడం కష్టమేమో కానీ.. ఏదైనా రాష్ట్రంలో విలీనం చేయడం మాత్రం సులభం అన్నారు.

అలాగే రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని వ్యాఖ్యానించారు జేసీ దివాకర్ రెడ్డి. తమ వాళ్ళు ప్రత్యేక రాయలసీమ అంటున్నారని.. అది సహకారం అయితే మంచిదేనని అన్నారు. ఇక రాష్ట్ర విభజన సమయంలోను ఈయన రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేయాలని గతంలో అన్నారు జేసీ దివాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news