మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొన్న మరో ప్రైవేట్ పాఠశాల బస్సు

-

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామ శివారులో ప్రైవేటు పాఠశాల బస్సును వెనుక నుండి ఢీకొంది మరో ప్రైవేట్ పాఠశాల బస్సు. తొర్రూరు మండల కేంద్రానికి చెందిన సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది రత్న ప్రైవేట్ స్కూల్ బస్సు. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు పోచారం గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని బొమ్మకల్లు గ్రామ మీదుగా తొర్రూర్ కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో విద్యార్థులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రత్న ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల వెల్లడించారు. రత్న ప్రైవేట్ పాఠశాల బస్సులో లిఫ్ట్ అడిగి ఎక్కిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news