రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

-

హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం ప్రశాంతంగా కొనసాగింది. బాలాపూర్ గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది వేలంలో బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది. ఈ లడ్డూను తుర్కయాంజల్‌వాసి దయానందరెడ్డి దక్కించుకున్నారు.

గతేడాది బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ రూ.24.60 లక్షలు పలికిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రూ.1,116తో ప్రారంభమైంది. ఈ వేలంలో సీఎం కేసీఆర్‌ తరపున ప్రతినిధి పాల్గొన్నారు. ఈ ఏడాది వేలంలో 20 మంది స్థానికులు సహా 36 మంది పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం పట్ల దయానంద్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాట విషయానికి వస్తే 1994లో 450 రూపాయలతో ఈ వేలంపాట మొదలైంది. వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షలు వరకు వచ్చింది. 2001 వరకు వేలల్లోనే ఉన్న ఈ వేలంపాట ధర ఆ తర్వాత నెమ్మదిగా లక్షల్లోకి వచ్చేసింది. ఇక గతేడాది ఏకంగా 24.60 లక్షలు పలికి రికార్డు క్రియేట్ చేసింది. ఈసారి ఆ రికార్డును బద్ధలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version