ప్రపంచ రాష్ట్ర సమితి అని పెట్టుకుని KA పాల్ తో తిరుగు – సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ కౌంటర్

-

ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుని కేఏ పాల్ తో కలిసి తిరగాలని సీఎం కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాదును పాకిస్తాన్లో కలపాలని చూసిన వారి సమాధి ముందు మోకరిల్లిన దుర్మార్గుడు కేసీఆర్.. ‘కాశీం చంద్రశేఖర్ రజ్వి’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులను అవమానపరిచే విధంగా అస్సాం సీఎం విషయంలో టిఆర్ఎస్ వ్యవహరించిందన్నారు.

కెసిఆర్ కుటుంబం వాటాలు అడగడంతో ఇక్కడి నుండి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి అన్నారు. 8 సంవత్సరాలు అయినా డ్రైనేజీలను మార్చలేదని.. ‘జీడిమెట్ల నీళ్లు పంపుతా కేసిఆర్ స్నానం చెయ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని అడిగితే మతతత్వమా కెసిఆర్ చెప్పాలన్నారు. అభివృద్ధి గురించి మేము మాట్లాడుతుంటే.. మతతత్వం గురించి సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హిందువులకు బిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది.. బరిద్దామా? అని అన్నారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినం పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 30 గ్రామాల కరెంటుని కెసిఆర్ తన ఫామ్ హౌస్ లోకి వాడుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news