క్షుద్ర పూజలు చేసి..సీఎం కేసీఆర్ నన్ను బలిస్తాడు – బండి సంజయ్

-

క్షుద్ర పూజలు చేసి..సీఎం కేసీఆర్ నన్ను బలిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ సీఎం కేసీఆర్‌..నీకు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సంచలన ట్వీట్‌ చేశారు. 317 జీవో ప్రవేశపెట్టిన కేసీఆర్ పై టీచర్లు కసి తీర్చుకున్నారని… ఎమ్మెల్సీ గా ఏ.వి.ఎన్ రెడ్డి గారిని గెలిపించారని గుర్తు చేశారు బండి సంజయ్‌.

పాలమూరు గడ్డ మీద నుండి క్లాక్ టవర్ సాక్షి గా చెబుతున్నా కేసీఆర్… నీ కు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందన్నారు బండి సంజయ్‌. నాకు జైలు కొత్తకాదు. 9 సార్లు జైలుకు పోయిన అన్నారు. మొన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంటే అర్ధరాత్రి నన్ను అరెస్టు చేసి 8 గంటలు తిప్పా రని వెల్లడించారు. కేసీఆర్ అవినీతి, మూర్ఖత్వపు పాలనను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా… అందుకు ఎన్ని సార్లయినా జైలుకు పోతానని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news