మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. పొన్నం మీ పార్టీ మాట తప్పినందుకు గాంధీ భవన్ వద్ద దీక్ష చేయి.. కేసీఆర్ పదేళ్ల పాటు గోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయ్యి అన్నారు. 80 కోట్ల మంది పేదలకు మోడీ అన్నం పెడుతున్నందుకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలను దగా చేసినప్పుడు ఒక్కనాడు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్.

వడ్ల కుప్పలపై రైతులు మరణిస్తే.. దీక్ష ఎందుకు చేయలేదన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చిన తరువాతనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస ధరకు వడ్లను కొంటారా..? లేదా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోస పడ్డ రైతులకు అండగా నిలిచింది తామేనని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి తెలియని కూటమికి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news